ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసపుచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ గుంటూరు జిల్లా మంగళగిరి 'వై' జంక్షన్ సమీపంలో మంగళవారం వైఎస్ జగన్ సమరదీక్ష చేపట్టారు. చంద్రబాబు ఏడాది పాలనపై 100 ప్రశ్నలతో తయారు చేసిన ప్రజా బ్యాలెట్ ను ఈ సందర్భంగా విడుదల చేశారు.
దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు. బాబు సర్కారుకు ఎన్ని మార్కులు వేస్తారో ప్రజల ఇష్టమని అన్నారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేలా మార్కులు వేయాలని ప్రజలను కోరారు.
0 comments:
Post a Comment