సమరదీక్షకు భద్రత కల్పించాల్సిందిగా కోరేందుకు వైఎస్ఆర్ సీపీ నేతలు ఎస్పీ కార్యాలయానికి వెళ్లగా.. ఎస్పీ త్రిపాఠి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఫోన్ లో మాట్లాడగా.. తాను మీటింగ్ లో ఉన్నానని, వచ్చేసరికి రాత్రి 11 గంటలు అవుతుందని ఎస్పీ చెప్పారు. పోలీసుల తీరుపట్ల వైఎస్ఆర్ సీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేత పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటున్న ఈ దీక్ష పోలీసులు భద్రత కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. ఎస్పీ కార్యాలయం వద్ద మెట్లపైనే బైఠాయించారు. వైఎస్ఆర్ సీపీ నేతలతో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు చర్చలు జరిపారు. వైఎస్ జగన్ సమరదీక్షకు భద్రత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ హామీ మేరకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిరసన విరమించారు.
Home »
» గుంటూరులో వైఎస్ఆర్ సీపీ అగ్రనేతల బైఠాయింపు
గుంటూరులో వైఎస్ఆర్ సీపీ అగ్రనేతల బైఠాయింపు
Written By news on Wednesday, June 3, 2015 | 6/03/2015
సమరదీక్షకు భద్రత కల్పించాల్సిందిగా కోరేందుకు వైఎస్ఆర్ సీపీ నేతలు ఎస్పీ కార్యాలయానికి వెళ్లగా.. ఎస్పీ త్రిపాఠి అందుబాటులో లేకుండా వెళ్లిపోయారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఫోన్ లో మాట్లాడగా.. తాను మీటింగ్ లో ఉన్నానని, వచ్చేసరికి రాత్రి 11 గంటలు అవుతుందని ఎస్పీ చెప్పారు. పోలీసుల తీరుపట్ల వైఎస్ఆర్ సీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షనేత పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొంటున్న ఈ దీక్ష పోలీసులు భద్రత కల్పించకపోవడం దారుణమని విమర్శించారు. ఎస్పీ కార్యాలయం వద్ద మెట్లపైనే బైఠాయించారు. వైఎస్ఆర్ సీపీ నేతలతో అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు చర్చలు జరిపారు. వైఎస్ జగన్ సమరదీక్షకు భద్రత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. అడిషనల్ ఎస్పీ హామీ మేరకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు నిరసన విరమించారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment