నేటి నుంచి రాజన్న బాట - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేటి నుంచి రాజన్న బాట

నేటి నుంచి రాజన్న బాట

Written By news on Saturday, July 14, 2012 | 7/14/2012

నా బాట రాజన్న బాట.. నా మాట జగనన్న మాట.. అని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సోమవారం మండల పర్యటనలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శనివారం నుంచి చేపట్టనున్న ఇందిరమ్మ బాటకు ఓ రోజు ముందుగానే ఆయన రాజన్నబాట ప్రారంభిస్తున్నట్లు రాజవరంలో ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి అన్ని శాఖల ప్రభుత్వాధికారులను కలుపుకుంటూ రాజవరం, యర్రంపేట, పొంగుటూరు పంచాయతీల్లోని 9 గ్రామాల్లో ప్రజల సమస్యలను వింటూ వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నిధులు ఉండి కూడా అధికారులు అలసత్వంతో ఇందిర జలప్రభ నిష్ర్పయోజనంగా మారుతోందని పేర్కొన్నారు.

ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో నిధులుకేటాయింపులకు ప్రభుత్వాన్ని నిలదీస్తానని, ఈ విషయంలోరాజీపడబోనని ఆయన పేర్కొన్నారు. ఇందిరమ్మ బాట ఉన్నన్నాళ్లూ రాజన్నబాటగానే గ్రామగ్రామాన పర్యటిస్తానని తెలిపారు. రాజవరం దళితపేటలో స్థానికులు ఏర్పాటుచేసుకున్న మహానేత వైఎస్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఎన్నికలకు ముందు 2,200 గ్యాస్ కనెక్షన్లు మంజూరుచేశారని, ఫలితాలు అధికార పార్టీకి వ్యతిరేకంగా రావడంతో ప్రజలపై కక్షసాధింపు చర్యలకు దిగుతు, ఇప్పటి వరకు వాటిని ఇవ్వలేదని చెప్పారు.
Share this article :

0 comments: