'మంత్రుల వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'మంత్రుల వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరి'

'మంత్రుల వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరి'

Written By news on Tuesday, August 14, 2012 | 8/14/2012

తప్పుడు వాదనలు, కేసులతో దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ను, వైఎస్‌ జగన్‌ను టార్గెట్‌ చేసిన ప్రభుత్వం ఇప్పుడు తన మెడకు చుట్టుకుంటున్న మంత్రుల వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరవుతోందని సీనియర్‌ విశ్లేషకులు, వివిధ పక్షాల నేతలు అభిప్రాయపడుతున్నారు. వాన్‌పిక్‌పై సీబీఐ దాఖలు చేసిన ఛార్జీషీట్‌లో ధర్మాన పేరు - నేడు రాజీనామా అన్న అంశంపై సాక్షి హెడ్‌లైన్‌షోలో చర్చ జరిగింది.

సమష్టి బాధ్యత మంత్రివర్గనిదేనని కొందరు మంత్రులు, సీనియర్ ఐఏఎస్‌లు మాట్లాడుతుంటే అసలు జగన్ కేసు నిలవదని సీనియర్‌ జర్నలిస్టు శ్రీనివాసరెడ్డి, వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత జనకప్రసాద్‌ అన్నారు. జగన్‌ టార్గెట్‌గానే ప్రభుత్వం వ్యవహరించిందని ఇప్పుడు మూల్యం చెల్లించుకునే రోజు వచ్చిందని టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే రాజయ్య అభిప్రాయపడ్డారు.
Share this article :

0 comments: