రేపు సాయంత్రం ‘అనంత’కు షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపు సాయంత్రం ‘అనంత’కు షర్మిల

రేపు సాయంత్రం ‘అనంత’కు షర్మిల

Written By news on Monday, October 22, 2012 | 10/22/2012

హైదరాబాద్, న్యూస్‌లైన్: షర్మిల చేస్తున్న ‘మరో ప్రజా ప్రస్థానం’ పాదయాత్ర ఈ నెల 23వ తేదీ(మంగళవారం) సాయంత్రం అనంతపురం జిల్లాకు చేరుకుంటుంది. ఈ నెల 18న ఇడుపులపాయలో ప్రారంభమైన ఆమె యాత్ర ఆదివారం వైఎస్సార్ జిల్లాలో సాగింది. మరో రెండు రోజుల పాటు ఇదే జిల్లాలో యాత్ర చేయనున్న షర్మిల 23న సాయంత్రానికి అనంతపురం జిల్లా సరిహద్దుల్లోని దాడితోటలో ప్రవేశిస్తారు. 

24న అనంతపురం జిల్లా చిల్లకొండయ్యపల్లి, పెదకొట్ల, తాడిమర్రి, శివంపల్లి(జాతీయ రహదారి)లో పాదయాత్ర చేస్తారు. 25న ఆత్మకూరు, తమ్మాపురం, సుబ్బారావుపేట క్రాస్ రోడ్డు, తుమ్మల క్రాస్ రోడ్డు మీదుగా నడకను కొనసాగించి రాత్రికి రహదారి పక్కనే బస చేస్తారు. 26న మైలంపల్లి, ధర్మవరంలో ప్రజలను కలుసుకుంటారు. మరో ప్రజాప్రస్థానం సమన్వయ, కార్యాచరణ కమిటీ సభ్యుడు తలశిల రఘురాం ఈ వివరాలను వెల్లడించారు. తదుపరి యాత్రను త్వరలో ప్రకటిస్తామన్నారు.
Share this article :

0 comments: