నేడు విజయమ్మ పర్యటన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు విజయమ్మ పర్యటన

నేడు విజయమ్మ పర్యటన

Written By news on Wednesday, October 30, 2013 | 10/30/2013

శ్రీకాకుళం, నరసన్నపేట, న్యూస్‌లైన్: వర్షాలు, వరదల్లో తీవ్రంగా దెబ్బతిన్న పంటలు, గ్రామాల పరిశీలనకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ బుధవారం జిల్లాకు రానున్నారు. ఈ పర్యటనలో పంట నష్టాలను పరిశీలించడంతోపాటు బాధిత రైతులు, ఇతర ప్రజలను పరామర్శిస్తారని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా కన్వీనర్ ధర్మాన కృష్ణదాస్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11.30 గంటలకు జిల్లాకు చేరుకోనున్న ఆమె నేరుగా లావేరు మండలం బుడుమూరు గ్రామానికి వెళతారు. అక్కడి ప్రజలను పరామర్శించిన అనంతరం పోలాకి మండలంలోని డి.ఎల్.పురం గుప్పెడుపేట గ్రామాలు సందర్శిస్తారు. అనంతర ఆర్.హెచ్.పురం మీదుగా సంతబొమ్మాళి మండలం వడ్డితాండ్రకు వెళతారు. అక్కడ థర్మల్ ప్లాంట్ కారణంగా ముంపునకు గురవుతున్న పొలాలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి శ్రీకాకుళం పట్టణానికి వెళతారు. పట్టణంలో ముంపునకు గురైన హయాతీనగరం ప్రాంతాన్ని పరిశీలిస్తారు. మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారని కృష్ణదాస్ తెలిపారు.
Share this article :

0 comments: