ముగ్గురు సైకోలు రాష్ట్రాన్ని విభజిస్తున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముగ్గురు సైకోలు రాష్ట్రాన్ని విభజిస్తున్నారు

ముగ్గురు సైకోలు రాష్ట్రాన్ని విభజిస్తున్నారు

Written By news on Friday, January 31, 2014 | 1/31/2014

'ముగ్గురు సైకోలు రాష్ట్రాన్ని విభజిస్తున్నారు'వీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులపై ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వీరు ముగ్గురు సైకోలు మాదిరిగా ప్రవర్తిస్తూ రాష్ట్ర విభజనకు పూనుకుంటున్నారని విమర్శించారు. పదవీ వ్యామోహం వల్ల విభజనకు సహకరించిన సీఎం తన వల్లే రాష్ట్ర విభజన ప్రక్రియ ఆగిపోయిందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నానని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
 
కిరణ్, చంద్రబాబు కుమ్మక్కులో భాగంగానే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడకుండా కూర్చుండిపోయారన్నారు. రెండు ప్రాంతాల్లో పార్టీని కాపాడుకోవాలని బాబు దుర్మార్గపు ఆలోచన చేస్తున్నారన్నారు.  అసెంబ్లీ సాక్షి కాంగ్రెస్, టీడీపీలు డ్రామాలాడుతున్నాయని శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు.
Share this article :

0 comments: