చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి:జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి:జగన్

చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి:జగన్

Written By news on Monday, January 20, 2014 | 1/20/2014

చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలి:జగన్వడమాలపేటలో జగన్ ప్రసంగంవీడియోకి క్లిక్ చేయండి
చిత్తూరు: చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావం - ఓదార్పు యాత్ర ఈరోజు సాయంత్రం చిత్తూరు జిల్లా వడమాలపేట చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాజకీయ వ్యవస్థలో విశ్వసనీయత పెరగాలన్నారు. ఉద్యమం బలంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉద్యోగులను భయపెట్టి సమైక్య ఉద్యమాన్ని నీరుగార్చారని చెప్పారు.

రాష్ట్రాన్నివిడగొట్టడానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో కిరణ్ కుమ్మక్కయ్యారని విమర్శించారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి  ఉన్నప్పుడు రాష్ట్రాన్ని విడగొట్టే ధైర్యం ఎవరూ చేయలేదన్నారు. 30 ఎంపీ స్థానాలు గెలుచుకుందామని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేవారినే ప్రధానిని చేద్దామని అన్నారు. సోనియా గాంధీ ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కిరణ్ సోనియా గీసిన గీత దాటకుండా విభజనకు సహకరిస్తున్నారని విమర్శించారు.
Share this article :

0 comments: