Home »
» మంగళగిరి వద్ద ప్రభుత్వ భూమి వాడుకోండి
మంగళగిరి వద్ద ప్రభుత్వ భూమి వాడుకోండి
ఆంధ్రప్రదేశ్ రాజధానికి మంగళగిరి వద్ద ఉన్న రెండు,మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి వాడుకోవచ్చని విపక్ష నేత, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేత జగన్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూమి ని వదలిపెట్టి మూడు పంటలు పండే భూములు బలవంతంగా తీసుకోవడం అన్యాయమని ఆయన అన్నారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాలో ఉన్నామని,ప్రజల సమస్యలపై నిలదీస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ భూమి ఉంటే సింగపూర్ కాకపోతే జపాన్..కాకుంటే అమెరికా లాంటిది కూడా కట్టుకోవచ్చని ఆయన వ్యంగ్యంగా అన్నారు. బుద్ది ఉన్న వారు మూడు పంటలు పండే భూమిని లాక్కోవడాన్ని హర్షించరని జగన్ ధ్వజమెత్తారు.రైతుల జీవితాలతో చెలగాటమాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.
|
0 comments:
Post a Comment