కడప : కమాలాపురం ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆరోగ్యం క్షీణించింది. ఆయన చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష బుధవారం నాటికి నాలుగో రోజుకు చేరింది. గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్ ఎస్ ఎస్) ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు, నీరు అందించాలనే డిమాండ్ తో రవీంద్రనాథ్ రెడ్డి వీరపునాయునిపల్లెలో ఆదివారం నిరవధిక దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్షలో ఉన్న ఆయనను పలువురు నేతలు పరామర్శించి వెళ్లారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు షుగర్ లెవెల్స్, రక్త పీడనం మెలమెల్లగా పడిపోతున్నాయని చెప్పారు.
Home »
» క్షీణించిన రవీంద్రనాథ్ రెడ్డి ఆరోగ్యం
క్షీణించిన రవీంద్రనాథ్ రెడ్డి ఆరోగ్యం
Written By news on Wednesday, March 4, 2015 | 3/04/2015
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment