తిరుపతిలో యువభేరి సదస్సు ఆరంభం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తిరుపతిలో యువభేరి సదస్సు ఆరంభం

తిరుపతిలో యువభేరి సదస్సు ఆరంభం

Written By news on Tuesday, September 15, 2015 | 9/15/2015

హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం విమానంలో రేణిగుంట చేరుకున్న వైఎస్ జగన్ అక్కడి నుంచి తిరుపతి పీఎల్‌ఆర్ కన్వెన్షన్ కు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనం కోసం విద్యార్థులతో నిర్వహిస్తున్న యువభేరి సదస్సులో వైఎస్ జగన్ పాల్గొన్నారు. విద్యార్థులతో చర్చించనున్నారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు వైఎస్ జగన్‌ సాగిస్తున్న పోరాటానికి విద్యార్థులు మద్దతు పలికారు. తిరుపతిలో నిర్వహిస్తున్న యువభేరి సదస్సకు భారీ సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఎస్వీ యూనివర్సిటీ, చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున వచ్చారు.
Share this article :

0 comments: