దేవుడు ఒక కోటి మందితో పంపాలనుకున్న ప్రేమను, మంచితనాన్ని ఒక్క వైఎస్‌లోనే నింపి పంపాడా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దేవుడు ఒక కోటి మందితో పంపాలనుకున్న ప్రేమను, మంచితనాన్ని ఒక్క వైఎస్‌లోనే నింపి పంపాడా?

దేవుడు ఒక కోటి మందితో పంపాలనుకున్న ప్రేమను, మంచితనాన్ని ఒక్క వైఎస్‌లోనే నింపి పంపాడా?

Written By news on Sunday, July 8, 2012 | 7/08/2012



ముఖ్యమంత్రిత్వాన్ని వైఎస్ అధిష్టించి దాని ఎత్తు, వైశాల్యాన్ని అనూహ్యంగా పెంచడంతో, ఇప్పుడు ఆ పీఠాన్ని ఎవరు అధిష్టించినా పిగ్మీల్లాగా, మరగుజ్జుల్లాగే కనిపిస్తున్నారు. అందుకే ప్రజలు ముఖ్యమంత్రి కోసం కాదు, వైఎస్ ఆశయాలు, స్వప్నాలను అమలు చేసే వారసుని కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు ఆయన వెన్నంటే ఉన్న వారు ఇప్పుడు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో విని కసితో రగిలిపోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ప్రజలు సానుభూతితో కాదు, కాంగ్రెస్, టీడీపీలపై కసితో ఓటేశారు.

‘‘నాలో మంచి, చెడు అనే రెండు జంతువులు ఉన్నాయి. ఈ రెండూ పరస్పరం పోట్లాడుతూంటా యి. మరి ఏది గెలుస్తుంది? నేను దేనికి తిండి పెట్టి పోషిస్తానో అదే గెలుస్తుంది?’’ అన్నాడు జార్జ్ బెర్నా ర్డ్‌షా. పదవులున్నా లేకున్నా, అధికారపక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా తనలోని ‘మంచితనం’ అనే దీపం ఆరిపోకుండా కాపాడుకొని ముఖ్యమంత్రిగా దాని ప్రజ్వలనంతో కోట్లాది మంది నిరుపేదల గుం డెల్లో వెలుగులు నింపిన మహోన్నతుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. ఐదున్నరేళ్ల ఆయన పాలన రాష్ట్రంపైన వేసిన ముద్ర ఎంత బలమైనదంటే, ఆయన మరణానంతరం మూడేళ్లకు కూడా ఆయన లేని రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని ప్రజలు ఊహించుకోలేకపోతున్నారు. దేవుడు తనదైన మంచితనాన్ని, ప్రేమను ఒక్కో వ్యక్తితో కొద్ది కొద్దిగా ఈ లోకానికి పంపిస్తాడ న్నది కొందరు వేదాంత పండితుల విశ్వాసం. కాని దేవుడు ఒక కోటి మందితో పంపాలనుకున్న ప్రేమను, మంచితనాన్ని ఒక్క వైఎస్‌లోనే నింపి పంపాడా? అన్న ఆలోచన ఆయన జీవితంలోకి తొంగి చూస్తే కలగక తప్పదు.

ఆయన మంచితనం, సౌశీల్యం, ప్రజలకు మంచి చేయాలన్న దీక్ష, తపన ఆయనకు ప్రజల గుండెల్లో స్థిరనివాసం ఏర్పరిచింది. కరెంటు ఫ్రీగా ఇస్తాడా? తీగలకు ఇక బట్టలారేసుకోవాల్సిందే’ అంటూ దెప్పి పొడిచిన వారి ముఖాలు నల్లబడేలా ఐదున్నరేళ్ల పాటు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత వైఎస్‌దే. రాష్ట్ర ప్రయోజనాలను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెట్టి, ప్రపంచ బ్యాంకు జీతగాడిగా మారి రాష్ట్రాన్ని దుంపనాశనం చేసిన చంద్రబాబు నాయుడు చదివింది ఎకనమిక్సే అయినా అతనికి పీపుల్స్ ఎకనమిక్స్ అర్థం కాలేదు.

ఎందుకంటే ఆయన దృష్టి ప్రజలకు మంచి చేయడం మీద కాక గద్దె మీదే ఉండేది. ఎన్ని అడ్డదారులు తొక్కి అయినా గద్దెనెక్కడమే ధ్యేయంగా పెట్టుకున్న నాయకుల మధ్యన వికసించిన వైఎస్ విశిష్ట వ్యక్తిత్వం అందరినీ అబ్బురపరచింది. పదవులకన్నా ప్రజలే ముఖ్యమనుకున్న నాయకుడు కాబట్టే ఎన్నోసార్లు ముఖ్యమంత్రి పదవి దొరికినట్టే దొరికి ఏ సైంధవుడో అడ్డుపడిన కారణంగా అవకాశం ఎన్నోసార్లు చేజారినా కుంగిపోకుండా పార్టీని వీడకుండా ప్రజలతో మమేకమై తన ప్రస్థానం సాగించాడాయన. ప్రజలకు మేలు చేయ డంలో, వారి కన్నీరు తుడిచి వారిలో నూతనోత్తేజం నింపడంలోనే ఆయన జీవ నసాఫల్యాన్ని, సంతోషాన్ని పొందాడు. అత్యున్నతమైన జీవన విలువలు, పటి ష్టమైన కుటుంబ విలువల పునాదిపైనే ఆయన విశిష్ట వ్యక్తిత్వం పరిఢవిల్లింది. కుటుంబ బంధాల్లోని మాధుర్యాన్ని అనుభవించి పంచినవాడు కనుకనే ముఖ్య మంత్రిగా రాష్ట్రాన్నంతటినీ తన సొంత కుటుంబంగా ప్రేమించాడు. అందరి కోసం అహోరాత్రులు శ్రమించాడు.

ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మొదటి మూడు నెలలలోనే ముఖ్యమం త్రి సహాయనిధి వార్షిక బడ్జెట్ పూర్తిగా ఖర్చయింది. తన దగ్గరికొచ్చే ఏ ఫైలూ ఆయన తిరస్కరించేవాడు కాదు. ‘సార్ ఈ లెక్కన ముఖ్యమంత్రి సహాయనిధికి ఎంత డబ్బు అయినా సరిపోదు’ అని ఆయన ఆంతరంగిక సిబ్బంది హెచ్చరిస్తే ‘ప్రజలకు సాయం చేయడానికి కాక మనం ఇంకెందుకున్నాం. పోనీ దానికి మరో మార్గం ఆలోచించండి’ అని పురమాయించారు. ఆ ఆలోచనల్లోనుంచి పుట్టిందే అపూర్వమైన ఆరోగ్యశ్రీ పథకం.

ప్రభుత్వాసుపత్రుల్లో డాక్టర్లు, నర్సుల కసిరింపుల మధ్య తుప్పు పట్టిన ఇనుప మంచాలు, చిరిగిపోయిన పరుపుల మీద పడుకోవడానికి కూడా నోచుకోని అభాగ్యులు, నిరుపేదలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందే వీలుకల్పించిన అద్భుత పథకం అది. గ్రామ గ్రామాన ఆ పథకంతో ప్రయోజనం పొందిన వారున్నారు.

రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దే వైఎస్‌ఆర్ వంటి మహోన్నత వ్యక్తిని తయారు చేసి పంపిన దేవుడు నిజంగా ఎంత మంచివాడు అని అంతా మురిసి పోతున్న తరుణంలోనే, ఆయన్ను అర్థాంతరంగా తన వద్దకు పిలుచుకున్న దేవుడు ఈ రాష్ట్రాన్ని ఎందుకిలా చిన్నచూపు చూశాడని ప్రతి గుండె అవిసిపోయే పరిస్థితి ఏర్పడింది. విజ్ఞాపన పత్రాలు ఒక చేత్తో తీసుకొని ఇంకో చేత్తో చెత్త బుట్టదాఖలు చేసే రాజకీయ నాయకుల పాలనా సంస్కృతిలో, ‘ప్రతి విజ్ఞాపన పత్రాన్ని పరిశీలించండి. వాళ్లడిగిందివ్వలేకపోతే ఏది ఇవ్వగలమో అదివ్వండి’ అని ఆదేశించిన మహనీయుడు వైఎస్.

ప్రకాశం జిల్లాకు చెందిన ఒక నిరుపేద తనకు అరెకరం భూమి ఇస్తే తన కుటుంబాన్ని పస్తులు లేకుండా పోషించుకుం టానని విన్నవించుకున్నాడు. అయితే అతనికి భూమి ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. అందువల్ల ఆలోచించి పేదలకు పశువులు పంపకం చేసే పథకం కింద అతనికి రెండు గేదెలు, ఒక ఏడాదికి సరిపడా పశుగ్రాసం అప్పటికప్పుడు మంజూరు చేశారు. ఒకప్పుడు ఆకలితో అలమటించిన ఆ కుటుంబం ఇప్పుడు కడుపునిండా తింటూ ఆత్మాభిమానంతో బతుకుతోంది. వారి గుండెల్లోని వైఎస్ బొమ్మను, ఆయన పట్ల కృతజ్ఞతను తుడిచిపెట్టేందుకు ఎంతమంది ‘బాబు’లు దిగిరావాలి?

ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ పేరు చెబితే చాలు ఓట్ల వర్షం కురిసే పరిస్థితిని ఆయన తన పాలన, పథకాల ద్వారా తెచ్చాడు. అదే ఆయన పాలిటి శాపమైంది. ఒకవైపు ఆయన పట్ల ప్రజల్లో అభిమానం పెరుగుతూంటే మరోవైపు ప్రచ్ఛన్న శత్రువులు అసూయతో రగిలిపోయారు. ఒక గులకరాయి హిమాలయంగా ఎదగడం పార్టీలోనే చాలా మంది జీర్ణించుకోలేకపోయారు.

కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు ఆయన 2004లో తన శక్తియుక్తు లన్నీ ఒడ్డి దాన్నొక జీవన్మరణ సమస్యగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడితే ఇంగ్లిష్ టీవీ ఛానెళ్లన్నీ అద్భుతంగా కవరేజీ ఇచ్చాయి. కాని ఇక్కడి వాళ్లు చిన్న చూపు చూశారు. పాదయాత్ర చివర్లో ఇచ్ఛాపురంలో వైఎస్ ఒక ముగింపు సభ పెడితే ఆహ్వానాలందుకొని కూడా ఏఐసీసీ పరిశీలకుల్లో ఒక్కరు కూడా ఆ సభకు హాజరుకాలేదు. పైకి నవ్వుతూ, ఆయనతో చెట్టాపట్టాలేసుకొని తిరిగి అపారంగా లాభం పొందిన వాళ్లు, ఆయనకు రాఖీలు కట్టేందుకు పోటీ లుపడ్డ చెల్లెమ్మలు ఆయన తర్వాత ఆయన కుటుంబంలోనే పిడిబాకులు దిం చగల సమర్థులని, ఆయన్ను ఎఫ్‌ఐఆర్‌లో నిందితుడిగా పేర్కొనగలరని ఊహిం చలేని పిచ్చి మారాజు వైఎస్. ఎందుకంటే ఆయనకు ప్రేమించడమే తప్ప ద్వేషించడం తెలియదు.

ముఖ్యమంత్రిత్వాన్ని వైఎస్ అధిష్టించి దాని ఎత్తు, వైశాల్యాన్ని అనూ హ్యంగా పెంచడంతో, ఇప్పుడు ఆ పీఠాన్ని ఎవరు అధిష్టించినా పిగ్మీల్లాగా, మరగుజ్జుల్లాగే కనిపిస్తున్నారు. అందుకే ప్రజలు ముఖ్యమంత్రి కోసం కాదు, వైఎస్ ఆశయాలు, స్వప్నాలను అమలు చేసే వారసుని కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఒకప్పుడు ఆయన వెన్నంటే ఉన్న వారు ఇప్పుడు ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నారో విని కసితో రగిలిపోతున్నారు. మొన్నటి ఎన్ని కల్లో ప్రజలు సానుభూతితో కాదు, కాంగ్రెస్, టీడీపీలపై కసితో ఓటేశారు.

ఎవరెన్ని సర్కస్‌లు చేసినా, మాయమాటలు చెప్పినా, ఎన్ని కుట్రలు చేసినా రాబోయే వైఎస్ జగన్ పాలనే తమ సమస్యలకు పరిష్కారమని నమ్ముతున్న విజ్ఞులు మన రాష్ట్ర ప్రజలు. కుటుంబం వెన్నులో ముఖ్యంగా జగన్ వెన్నులో కుట్రదారులు దించే ప్రతిబాకూ ప్రజల కసిని మరింత పెంచుతోంది. ఒక మహోన్నత వ్యక్తిని తండ్రిగా పొందడం జగన్ అదృష్టం. ఆ మహోన్నత వ్యక్తి ఆశయాల సాధనకు ఆయనకు దొరకబోయే అవకాశం, ఈ దేశానికి అద్భు తమైన పాలనాదక్షత, అపూర్వమైన పట్టుదల, నిబద్ధత కలిగిన ఒక మహానాయ కుడిని వైఎస్ వారసుడిగా జగన్ రూపంలో ఈ దేశానికివ్వబోతోంది. పూర్తిగా కరిగి కనుమరుగై కూడా కాంతులీనుతున్న కొవ్వొత్తి వైఎస్!!
Share this article :

0 comments: