సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ డైరెక్షన్ లో పనిచేస్తున్నారని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుందని భావించి సీఎం మీడియా ముందుకు వచ్చారని అన్నారు. విభజనకు వైఎస్ బీజం వేశారంటూ సీఎం మాట్లాడటం దారుణమన్నారు. ఒకవేళ వైఎస్సే విభజన చేయాలనుకుంటే .. ఆపని ఎప్పుడో చేసేవారని చెప్పారు. వైఎస్ఆర్లాంటి బలమైన నాయకుడు వల్లే విభజన జరగలేదని ప్రతి సామాన్యుడికి తెలుసునని అన్నారు.
తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే వైఎస్సార్ పై సీఎం కిరణ్ నిందలు వేస్తున్నారని అన్నారు. విభజన ప్రకటన ముందే కిరణ్ స్పందించాల్సివుందన్నారు. జగన్ ను రాజకీయంగా ఎదుర్కొలేకే కాంగ్రెస్ విభజన నిర్ణయం తీసుకుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతలంతా రాజీనామాలు చేసి సంక్షోభం సృష్టించివుంటే పార్టీ నిర్ణయం తీసుకునేదా అని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు.
0 comments:
Post a Comment