శుక్రవారం చంద్రబాబును కలిసి కాళ్లావేళ్లాపడి వేడుకున్నా ఏ మాత్రం కనికరించకుండా.. నేనెవరికి చెప్పుకోవాలి అంటూ మాట్లాడారని వాపోయారు. రామానుజయ్య మాట్లాడుతూ గోడు తెలపడానికి వెళ్లిన తన భార్యను, అభిమానులను మహిళ అని చూడకుండా చంద్రబాబు యాత్రలోని పోలీసులు, సెక్యూరిటీ చితకబాదారన్నారు.
ఈ ఘటనలో ఒకరి చేయి విరిగిందన్నారు. అస్పత్రిలో చికిత్ర పొందుతుంటే పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా, ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ కనీసం ఎలా ఉందని పలకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పొత్తులలో భాగంగా బీజేపీకి కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే జయమంగళకు గాని, తనకు గాని టిక్కెట్టు కేటాయిస్తే కలసి పనిచేస్తామని చెప్పినా చంద్రబాబు వినలేదన్నారు. తనకు పార్టీలో జరిగిన అన్యాయాన్ని నియోజకవర్గ ప్రజలకు వివరిస్తానని ఈ సందర్భంగా ఆయన వివరించారు.
0 comments:
Post a Comment