జగన్ బెయిల్ను అడ్డుకునేందుకు బహిరంగంగా ఇన్ని ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు, టీడీపీ ఎంపీలు తెరచాటున మరెన్ని బాగోతాలు నడిపిస్తున్నారో అని అంబటి అనుమానం వ్యక్తం చేశారు. ‘జగన్పై కేసు దర్యాప్తు 2011 ఆగస్టు 10న ప్రారంభమైంది. జగన్ను విచారణ పేరుతో పిలిచి 2012 మే 27న అక్రమంగా అరెస్ట్ చేశారు. 16 నెలలుగా నిర్బంధంలో ఉంచారు. ఈ దేశంలో ఏ వ్యక్తినీ 90 రోజులకు మించి నిర్బంధంలో ఉంచకూడదని సీఆర్పీసీ చెబుతోంది. అయినా న్యాయస్థానాలు సీబీఐకి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాయి.
అన్ని అంశాల మీద దర్యాప్తు పూర్తి చేసి సెప్టెంబర్ 9లోగా చార్జిషీట్ వేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు చంద్రబాబు, టీడీపీ ఎంపీలు ఆ తీర్పు మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? సుప్రీంకోర్టు తీర్పునే తప్పుబడుతున్నారా?’ అని అంబటి సూటిగా ప్రశ్నించారు. విచారణలో ఉన్న కేసుకు సంబంధించి సీబీఐ, ఈడీ, సీవీ
0 comments:
Post a Comment