జగన్ బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్ట్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్ట్

జగన్ బెయిల్ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన కోర్ట్

Written By news on Wednesday, September 18, 2013 | 9/18/2013

జగన్ బెయిల్ పిటిషన్ పై తీర్పు  వాయిదా వేసిన కోర్ట్ ..ముగిసిన వాదనలు తీర్పు సెప్టెంబర్ 23 కు వాయిదా వేసిన కోర్టు . 


జగన్ కు బెయిల్ ఇవ్వద్దు: సీబీఐ
జగన్‌ బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ అధికారులు  నాంపల్లి సీబీఐ కోర్టులో కౌంటర్‌ దాఖలు చేసింది. రాజకీయంగా అత్యంత ప్రభావశీలి అయిన జగన్‌ను ఈ పరిస్థితుల్లో విడుదల చేస్తే విచారణకు ఆటంకం కలుగుతుందని కౌంటర్‌లో సీబీఐ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్‌ మంజూరు చేయరాదని కోర్టును కోరింది.

రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు దాఖలు చేసిన ఆర్ సీ నెంబర్‌ 19/ఏ కేసుకు సంబంధించి అన్ని అంశాల్లో తమ దర్యాప్తు ముగిసిందని సీబీఐ... కోర్టుకు వెల్లడించింది. నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయమని మాత్రమే సీబీఐ చెప్పిందని...పిటిషనర్‌కు  బెయిల్‌ మంజూరు చేయాలనే ప్రస్తావన లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది.  మరో వైపు  జగన్‌కు  బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది సుశీల్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తున్నారు.  దర్యాప్తు పూర్తయిందని చెప్పినందున బెయిల్‌ మంజూరు చేయాలని సుశీల్‌ కుమార్‌ కోర్టును కోరారు.
Share this article :

0 comments: