జగన్ అంటేనే బాబుకు ముచ్చెమటలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అంటేనే బాబుకు ముచ్చెమటలు

జగన్ అంటేనే బాబుకు ముచ్చెమటలు

Written By news on Monday, September 16, 2013 | 9/16/2013

జగన్ అంటేనే బాబుకు ముచ్చెమటలు
సాక్షి, హైదరాబాద్: జగన్ అనే మూడు అక్షరాలు వింటేనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. జనం మధ్యలో ఉండాల్సిన నాయకుడు బెయిల్ కోసం, అదీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారనగానే బాబు వెంటనే తన బస్సు యాత్రను రద్దు చేసుకుని మరీ ఢిల్లీ వెళ్తున్నారంటూ ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఏదో డీల్ కుదుర్చుకుందంటూ బాబు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. నిజానికి కాంగ్రెస్‌తో డీల్ కుదుర్చుకున్నది టీడీపీయేననన్నారు. అలాంటిది తమ పార్టీపై విమర్శలు చేయడమేంటంటూ బాబుకు పలు ప్రశ్నలు సంధించారు...
 
  కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన టీడీపీ గత నాలుగేళ్లుగా ఎవరితో పోరాడుతోంది?

   జగన్‌పై కాంగ్రెస్ నేత శంకర్రావు, టీడీపీ ఉమ్మడిగా పిటిషన్  వేయడం, ఎమ్మెల్సీ ఎన్నికలు, కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికలు, సమాచార కమిషనర్ల నియామకం, 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు, రిటైల్ ఎఫ్‌డీఐ అనుమతులపై రాజ్యసభలో కాంగ్రెస్‌కు అనుకూలంగా టీడీపీ ఎంపీల గైర్హాజరు... ఇవన్నీ కాంగ్రెస్‌తో టీడీ పీ కలిసి పోయిందనడానికి నిదర్శనాలు కావా? ప్రజా సమస్యల విషయంలో కాంగ్రెస్‌పై మీరు కనీసమాత్రంగానైనా చేసిన పోరాటాలేమిటి? వేళ్ల మీద లెక్క బెట్టి నాలుగు చెప్పగలరా? చిదంబరం, అహ్మద్ పటేల్, హెచ్‌ఆర్ భరద్వాజ్, దిగ్విజయ్‌సింగ్, రేణుకా చౌదరి వంటి కాంగ్రెస్ నేతలతో మీరు మాట్లాడ్డం లేదని (టచ్‌లో లేరని) కాణిపాకం వినాయకుడి మీద ఒట్టేసి చెప్పగలరా?
 
   మీరు ఏ డీల్ ప్రకారం గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్నీ మీరై మద్దతిచ్చారు? ఏ డీల్ ప్రకారం 2008లో ఇచ్చిన తెలంగాణ అనుకూల లేఖను వెనక్కు తీసుకోవడం లేదు? ఏ డీల్ ప్రకారం చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలపక ముందు ఆ పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టకుండా, తద్వారా ప్రభుత్వం పడిపోకుండా సహకరించారు? ఏ డీల్ ప్రకారం వైఎస్సార్‌సీపీ, ఇతర ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పాల్గొనొద్దంటూ మీ టీడీపీ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు? ఏ డీల్ ప్రకారం టీడీపీ ఎంపీలు కాంగ్రెస్ కోటరీలోని వ్యక్తుల్ని శనివారం ఢిల్లీలో ఓ హోటల్‌లో కలుసుకున్నారు? ఏ డీల్ ప్రకారం మీరు సీబీఐ, ఈడీ కేసులు మీ మీద రాకుండా కాంగ్రెస్ కాళ్లావేళ్లా పడ్డారు. ఏ డీల్ ప్రకారం మీరు రాష్ట్ర విభజనకు అంగీకరించారు? ఏ డీల్ కుదుర్చుకునేందుకు ఇప్పుడు ఢిల్లీ వెళ్తున్నారు?
 
  కాంగ్రెస్‌తో జగన్ కుమ్మక్కయ్యారని, ఇతరత్రా పచ్చి అబద్ధాలతో గత 16 నెలలుగా కొన్ని జాతీయ వార్తా పత్రికల్లో మీకు బాగా తెలిసిన మీడియా మేనేజ్‌మెంట్ పద్ధతుల్లో వార్తలు, కథనాల నాట్లు వేయించారు. జగన్‌ను జనంలో ఎదుర్కొనే ధైర్యం మీకుందా? అది లేకే కదా మీ ఢిల్లీ రాజకీయాలు, కాంగ్రెస్‌తో మీ కుమ్మక్కులు!
 
  ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ 1984 నుంచి 2013 వరకూ 30 ఏళ్లలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చేయలేని నష్టం... పుట్టి మూడేళ్లయినా కాని వైఎస్సార్‌సీపీ వల్ల జరిగింది. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయటానికి, ఢిల్లీనే ఎదిరించి ముందుకు వెళ్లటానికి, తనను ఎంతటి కష్టాలు పెడుతున్నా నిబ్బరంగా నిలబడటానికి ప్రతీకగా మారిన జగన్ ఈ రోజు ఏ పార్టీతోనైనా ఎందుకు డీల్ కుదుర్చుకోవాలి? తెరచాటు ఒప్పందాలు, మనుషుల కొనుగోళ్లు, అధికారం కోసం వెన్నుపోట్లు మీకు మాత్రమే తెలిసిన విద్యలు. కేసులు వేయించింది మీరు, కాంగ్రెస్. వాటిని ఎదుర్కొంటున్నది జగన్. మరిక ఎవరు కుమ్మక్కయినట్టు? కుమ్మక్కయితే మా నాయకుడు 16 నెలలుగా నిర్బంధంలో ఉండేవాడా? కుమ్మక్కు కావాల్సిన ఖర్మ జగన్‌కు ఎందుకొస్తుంది? ఆయనపై కాంగ్రెస్ తప్పుడు కేసులు పెట్టినందుకా? జైల్లో ములాఖత్ విషయంలోనూ కర్కశంగా వ్యవహరిస్తూ కుటుంబ సభ్యులను కూడా మీరు మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నందుకా? ప్రజలు ఈ మాత్రం ఆలోచిస్తారని కూడా మీరు గుర్తించరా?
 
  ఈ రోజు కాంగ్రెస్ లేకుండా మీరు బతకగలిగిన పరిస్థితి ఉందా బాబూ? కాంగ్రెస్‌తో కుమ్మక్కు కాకుండా మీరు ఒక్క అసెంబ్లీ సీటయినా తెచ్చుకోగల పరిస్థితి ఉందా? కొన్నేళ్లుగా రాష్ట్రంలో జరిగిన 45 ఉప ఎన్నికల్లో ఏకంగా 26 చోట్ల మీ టీడీపీకి డిపాజిట్లు పోయాయి! మీరు, మీ నాయకత్వం ఒక స్వతంత్ర పార్టీగా మనగలిగిన పరిస్థితంటూ అసలుందా? 30 శాతం కాంగ్రెస్ వాదినని చెప్పుకున్న మీలో ఈ రోజున 3 శాతమైనా ఎన్టీఆర్ స్థాపించిన కాంగ్రెస్ వ్యతిరేక టీడీపీ రక్తముందా? లేక 97 శాతం కాంగ్రెస్ రక్తమే ఉందా? ఓట్లూ, సీట్ల కోసం ఈ రాష్ట్రాన్ని విడగొడతామంటూ సీడబ్ల్యూసీ, యూపీఏ తీర్మానించినా దానివల్ల 6 కోట్ల మందికి కలిగే కష్టనష్టాల విషయంలో కూడా మీ గుండె కరగలేదు. మీ కాలు కదలలేదు. విభజన నిర్ణయం వెలువడ్డ 47 రోజుల తరవాత కూడా సమైక్య రాష్ట్రం కోసం ఒక్క మాటా మాట్లాడలేదు. అలాంటిది, అర్ధంతరంగా బస్సు యాత్ర ఆపి, ఢిల్లీ వెళ్లి మీ చీకటి మిత్రులను కలుసుకోవడానికి హడావుడి పడ్డారంటే, అది కేవలం ఒకే ఒక్క వ్యక్తికి వ్యతిరేకంగా కాదా? మీరు ప్రజల్లో లేకపోయినా మీడియాలో ఒక వర్గాన్ని, అధికార పార్టీలను, వ్యవస్థల్లోని వ్యక్తులను మేనేజ్ చేసి, ఇలాంటి నీచ రాజకీయాలు చేసి బతికేయాలన్న మీ ఆలోచన మీకే సిగ్గుగా అనిపించడం లేదా?
 
Share this article :

0 comments: