16 నెలలుగా నిర్బంధంలో ఉన్న వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డిపై ఎల్లో మీడియా దుష్ర్పచారం చేస్తోందని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. వైఎస్ జగన్ పై ఏ కేసు లేకపోయినా తమదైన శైలిలో అడ్డగోలుగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ నేతలు మేకపాటి సుచరిత, ఉప్పులేటి కల్పన, రోజాలు విమర్శించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన వారు ఎల్లో మీడియా ఆడుతున్న డ్రామాను ఎండగట్టారు. ఓ పరిశ్రమ విస్తరణ చేపట్టి, కరెంటు, నీరు ఇచ్చినా తప్పుపడుతున్నారన్నారు. అలాంటి అంశాలను కూడా తప్పు పట్టి అన్యాయపరిస్థితిని నేడు చూస్తున్నామన్నారు.
సుప్రీంకోర్టు గడువు ముగియడంతో బెయిల్ కోసం జగన్ అభ్యర్థించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విలువైన భూములను చంద్రబాబు పప్పు-బెల్లాల్లా పంచినా సీబీఐకి కనిపించడం లేదని వారు తెలిపారు. జగన్మోహనరడ్డి ఏ నేరం చేయకపోయినా జగన్ ను నిర్బంధంలో ఉంచాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దుర్నీతితో వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు గడువు ముగియడంతో బెయిల్ కోసం జగన్ అభ్యర్థించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విలువైన భూములను చంద్రబాబు పప్పు-బెల్లాల్లా పంచినా సీబీఐకి కనిపించడం లేదని వారు తెలిపారు. జగన్మోహనరడ్డి ఏ నేరం చేయకపోయినా జగన్ ను నిర్బంధంలో ఉంచాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దుర్నీతితో వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు.
0 comments:
Post a Comment