Home »
» జగన్ ను కలిసిన షర్మిల
జగన్ ను కలిసిన షర్మిల
హైదరాబాద్ : షర్మిల మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. సమైక్య శంఖారావం బస్సుయాత్రను ముగించుకున్న ఆమె ఈరోజు ఉదయం విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం షర్మిల చంచల్ గూడ జైల్లో జగన్ ను కలిసి సమైక్య శంఖారావం బస్సు యాత్ర వివరాలు తెలిపినట్లు సమాచారం. షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర 14వరోజు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో ముగిసింది. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి బయలుదేరిన షర్మిల సీమాంధ్ర జిల్లాల్లో పర్యటించారు
0 comments:
Post a Comment