వైఎస్సార్ సీపీ కార్యకర్తపై బ్లేడ్లతో దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ సీపీ కార్యకర్తపై బ్లేడ్లతో దాడి

వైఎస్సార్ సీపీ కార్యకర్తపై బ్లేడ్లతో దాడి

Written By news on Monday, June 4, 2012 | 6/04/2012

చందానగర్, న్యూస్‌లైన్: ఉప ఎన్నికల ప్రచాంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బ్యాగ్‌లను పోలీసులు తనిఖీ చేసి, అవమానించడాన్ని నిరసిస్తూ.. ఆది వారం గచ్చిబౌలిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొని రాత్రి 10 గంటల సమయంలో.. ఇంటికి తిరిగి వస్తున్న పాపిరెడ్డి కాలనీకి చెందిన డి.నరేశ్ (20)ను అదే బస్తీకి చెందిన ఎనిమిది మంది కాంగ్రెస్ నాయకులు అడ్డగించారు. పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి బలవంతంగా లాక్కెళ్లి నిర్బంధించారు. బ్లేడ్లతో వీపు, ఛాతీ, మెడ, తల, చేతులపై విచక్షణారహితంగా గాట్లు పెట్టారు. వైఎస్సార్ సీపీలో పని చేసినా, ఆ పార్టీ తలపెట్టే కార్యక్రమాల్లో పాల్గొన్నా, ఆ పార్టీ నాయకులతో కలిసి తిరిగినా చంపేస్తామని బెదిరించి, వదిలేశారు. తీవ్ర గాయాలైన నరేశ్ పడుతూ, లేస్తూ ఇంటికి చేరుకొని తనపై జరిగిన దాడిని కుటుంబ సభ్యులకు తెలపడంతో ఈ దారుణ ఉదంతం వెలుగు చూసింది.
Share this article :

0 comments: