ఓటర్ల జాబితా ముద్రణ ఈ నెల 31న జరుగుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్ లాల్ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని తన కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితా, ఈ నెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటరు దినోత్సవ ఏర్పాట్లతో పాటు రానున్న ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు వంటి అంశాలపై సమీక్షించారు.
ఓటరు దరఖాస్తులను ఈ నెల 21లోగా ఫొటోలతో సహా అప్డేట్ చేయాలని, 23లోగా ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించిన ధ్రువీకరణ ప్రతాలతో కూడిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ మాట్లాడుతూ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 4,41,441 దరఖాస్తులు అందాయని, 3,70,780 తనిఖీ చేసి ఆమోదించామన్నారు. 39,232 దరఖాస్తులను తిరస్కరించినట్టు తెలిపారు.
మిగిలిన పెండింగ్ దరఖాస్తుల పరిశీలన శనివారం మధ్యాహ్నం నాటికి పూర్తవుతుందన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
ఓటరు దరఖాస్తులను ఈ నెల 21లోగా ఫొటోలతో సహా అప్డేట్ చేయాలని, 23లోగా ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించిన ధ్రువీకరణ ప్రతాలతో కూడిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ మాట్లాడుతూ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 4,41,441 దరఖాస్తులు అందాయని, 3,70,780 తనిఖీ చేసి ఆమోదించామన్నారు. 39,232 దరఖాస్తులను తిరస్కరించినట్టు తెలిపారు.
మిగిలిన పెండింగ్ దరఖాస్తుల పరిశీలన శనివారం మధ్యాహ్నం నాటికి పూర్తవుతుందన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు.
0 comments:
Post a Comment