నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం

నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం

Written By news on Thursday, January 16, 2014 | 1/16/2014

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  ఆధ్వర్యలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నేడు సమావేశం కానున్నారు.  అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనను  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా  వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే..ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రాష్ట్ర విభజనపై చర్చను ఖండించారు.

చర్చలో పాల్గొనడమంటే రాష్ట్ర విభజనను అడ్డుకోవడమేనని చెప్పారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ శాసన సభాపక్ష నాయకురాలు వైఎస్‌ విజయమ్మ కూడా రాష్ట్ర విభజనపై అసెంబ్లీలోనే కాంగ్రెస్‌ , టీడీపీలను నిలదీశారు. మెజార్టీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ రెండు పార్టీలు నడుచుకోవడం లేదని విమర్శించారు. సభ నుంచి వాకౌట్ చేశారు..అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

మరోవైపు జగన్‌మోహన్‌రెడ్డి నాలుగో విడత సమైక్య శంఖారావం యాత్ర ఈ నెల 17న చిత్తూరు జిల్లా నగరి నుంచి పునఃప్రారంభం కానుంది. సంక్రాంతి పండుగ కారణంగా ఈ నెల 13 నుంచి నాలుగు రోజుల పాటు యాత్రకు జగన్ విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో భాగంగా 17న సాయంత్రం పుత్తూరు పట్టణంలో బహిరంగ సభ జరగనుంది
Share this article :

0 comments: