లగడపాటి మంచి పనే చేశారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » లగడపాటి మంచి పనే చేశారు

లగడపాటి మంచి పనే చేశారు

Written By news on Thursday, February 13, 2014 | 2/13/2014

లగడపాటి మంచి పనే చేశారు
న్యూఢిల్లీ : విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చేసి మంచిపనే చేశారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ బిల్లును ఎవరి ఆమోదం లేకుండానే లోక్ సభలో ప్రవేశపెట్టేసినట్లు స్పీకర్ మీరాకుమార్ ప్రకటించినప్పుడు ఆయన తనకు తోచినట్లుగా నిరసన వ్యక్తం చేయాలనుకున్నారని, అందుకోసమే పెప్పర్ స్ప్రే చేశారని చెప్పారు.

''లగడపాటి గారు చేసినది మంచిపని. పెప్పర్ స్ప్రే తీసుకుని కొట్టారు. దానివల్ల ఎవరికీ హాని జరగదు, ఎవరూ చనిపోరు. ఈ మధ్యకాలంలో అక్కచెల్లెమ్మలు ఒంటరిగా పోయేటప్పుడు తమ ఆత్మ రక్షణ కోసం దాన్ని తీసుకెళ్తున్నారు. అది చల్లినప్పుడు కాస్త కళ్లు మండుతాయి, దగ్గు వస్తుంది. అంతేగానీ, ఎవరూ చనిపోరు. అన్యాయాన్ని ప్రతిఘటించడానికి ఒక నిరసన వ్యక్తం చేయాలని ఆయన ఇలా చేసి చూపించారు. అదేం తప్పుకాదు'' అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
Share this article :

0 comments: