హొరెత్తిన గడపగడపకు వైఎస్సార్ సీపీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » హొరెత్తిన గడపగడపకు వైఎస్సార్ సీపీ

హొరెత్తిన గడపగడపకు వైఎస్సార్ సీపీ

Written By news on Friday, February 14, 2014 | 2/14/2014

హొరెత్తిన గడపగడపకు వైఎస్సార్ సీపీ
హొరెత్తిన గడపగడపకు వైఎస్సార్ సీపీ
 గుడివాడ, :
 గుడివాడ పట్టణంలో చేపట్టిన గడపగడపకు వైఎస్సార్ సీపీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనం గురువారం పోటెత్తారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)కి ఘన స్వాగతం పలికారు. తొలుత  పెద ఎరుకపాడుకు చెందిన మాజీ కౌన్సిలర్ అడపా బాబ్జీ ఇంటి వద్ద నుంచి ప్రచారం ప్రారంభించారు. కార్మిక నగర్, చెంచుపేట తదితర ప్రాంతాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేసే నేతలకే ఆదరణ ఉంటుందని, ఈ ప్రచారం ద్వారా రుజువైందన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాజశేఖర్‌రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను మరింత సమర్థవంతంగా అమలు పరుస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ, 108, పేదలకు పక్కా ఇళ్లు నిర్మించే సత్తా జగన్‌మోహన్‌రెడ్డికే ఉందన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు పలు సమస్యలు నాని దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన తక్షణమే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. 26 వవార్డులో ఉన్న నిరుపేదలు, ముస్లింలు, మైనార్టీ వర్గాల వారు కొడాలి నాని వెంట కదిలారు. ప్రచారం అనంతరం పార్టీ సీనియర్ నేత పాలేటి చంటి ఇంటి వద్ద మధ్యాహ్నం విశ్రాంతి తీసుకున్నారు.
 పెద ఎరుకపాడులో జన సందోహం
 గురువారం మధ్యాహ్నం నుంచి పట్టణంలోని పెదఎరుకపాడులో  గడపగడపకు వైఎస్సార్ సీపీ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వార్డు ప్రముఖుల నేతృత్వంలో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొన్నారు. చంద్రయ్య కాలువ గట్టుమీదుగా ఈ ప్రచారం సాగింది. అనంతరం పెద ఎరుకపాడులోని దళిత యువకులంతా కొడాలి నానికి స్వాగతం పలికారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆపి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.  ఈ సందర్భంగా పెద ఎరుకపాడు యువకులు గూడపాటి ప్రకాష్, అబ్బూరీ దాసు తదితరులు మాట్లాడుతూ దిళితుల కమ్యూనిటీ హాలు శిథిలావస్థకు చేరిందని తెలిపారు. శ్మశానానికి వెళ్లే దారి లేదని చెప్పారు. వెంటనే నాని స్పందించి సొంత నిధులతో శ్మశానానికి దారి వేయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు ఇంటివద్ద నానికి పూర్ణకుంభంతో వేదమంత్రాలతో ఘన స్వాగతం పలికారు. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మండలి హనుమంతరావు, డాక్టర్ కె.విజయ్‌కుమార్‌రెడ్డి, ఎం.వి.నారాయణరెడ్డి,  బాణావత్ ఇందిరారాణి, పెద్ది రమణ, పార్టీ టౌన్ కన్వీనర్ మరీదు కృష్ణమూర్తి, గుడివాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు,  పార్టీ నేత పాలేటి చంటి, మాజీ కౌన్సిలర్లు అడపా బాబ్జీ,  దారపురెడ్డి నాగలలిత,  చింతల భాస్కరరావు, బొజ్జగాని కోటమ్మ, సూరపనేని అజయ్, మూడెడ్ల ఉమా,   గంధం రాజేంద్ర ప్రసాద్, గణపతి లక్ష్మణరావు, వెంపల అప్పారావు,  తోట ప్రసాద్, సనపల ఆది (ఆది మిల్క్), మహిళా, యువజన, ఎస్సీ సెల్ పట్టణ కన్వీనర్లు కాటాబత్తుల రత్నకుమారి, లోయ రాజేష్, మెండా చంద్రపాల్, యూత్  జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు బట్రాజు బ్రదర్స్, బార్ అసోసియేషన్ సెక్రటరీ కె.మురళి, వార్డుల నేతలు దారపురెడ్డి వాసు,  చంద్రగిరి శారద, వాసుపల్లి చంద్రమోహన్ (నాని), గూడపాటి ప్రకాష్, దారం ఉపేంద్ర, అన్నవరపు నోము, రేమల్లి నాని, సురేష్ పాల్గొన్నారు.
Share this article :

0 comments: