వైఎస్ఆర్ సీపీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ఆర్ సీపీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ

వైఎస్ఆర్ సీపీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ

Written By news on Tuesday, February 25, 2014 | 2/25/2014

'వైఎస్ఆర్ సీపీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ'
హైదరాబాద్ : ప్రజలకు కావల్సింది అభివృద్ధి, సంక్షేమం అని తెలుగువారు ఏ ప్రాంతంలో ఉన్నా వారికి అండగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు.  వైఎస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు ఆమె మంగళవారం దిశానిర్దేశం చేశారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అని...ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యలోనే పాలు పంచుకోవాలని ఆమె సూచించారు. నిత్యం ప్రజల మధ్యే ఉండి వారి కోసం పోరాడాలన్నారు.  

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంగ్రామంలో ధైర్యంగా ముందుకు వెళ్దామని, ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనకడుగు వేయొద్దని విజయమ్మ పార్టీ శ్రేణులకు సూచనలు ఇచ్చారు. పార్టీ ప్లీనరీలో అధ్యక్షుడు వైఎస్ జగన్ పేర్కొన్న పథకాలన్నింటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. వైఎస్ మరణం తర్వాత నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలపై ఒక్కపైసా కూడా భారం వేయలేదని విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడసలు ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు. ఓట్లు,సీట్లు కోసం కాంగ్రెస్, టీడీపీలు రాష్ట్రాన్ని ముక్కలు చేశాయని ఆమె ధ్వజమెత్తారు.
Share this article :

0 comments: