వారిని దద్దమ్మలన్నారు-ఇప్పుడు పార్టీలో చేర్చుకుంటున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వారిని దద్దమ్మలన్నారు-ఇప్పుడు పార్టీలో చేర్చుకుంటున్నారు

వారిని దద్దమ్మలన్నారు-ఇప్పుడు పార్టీలో చేర్చుకుంటున్నారు

Written By news on Tuesday, March 25, 2014 | 3/25/2014

'వారిని దద్దమ్మలన్నారు-ఇప్పుడు పార్టీలో చేర్చుకుంటున్నారు'
హైదరాబాద్: కాంగ్రెస్ నేతలను దద్దమ్మలన్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని వైఎస్ఆర్ సిపి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవిఎస్ నాగిరెడ్డి విమర్శించారు. మోసపూరిత వాగ్ధానాలతో చంద్రబాబు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు.  వ్యవసాయం దండగ అని చంద్రబాబు అంటే,  దివంగత మహానేత వైఎస్ఆర్ పండగ చేసి చూపించారన్నారు.

గతంలో విడుదల చేసిన మేనిఫెస్టోలపై చర్చకు చంద్రబాబు సిద్ధమా? అని సవాల్ విసిరారు. చంద్రబాబు, వైఎస్ఆర్ హయాంలలో జరిగిన అభివృద్ధిపై తాము చర్చకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. టిడిపి వారు అందుకు సిద్ధంగా ఉన్నారా? అని నాగిరెడ్డి ప్రశ్నించారు.
Share this article :

0 comments: