ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులతో చర్చిం చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అభ్యర్థుల విజయంకోసం కార్యకర్తలు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. సోమవారం రోజుతో నామినేషన్లు పూర్తి కాగానే అభ్యర్థులు ప్రచార కార్యక్రమంలోకి రంగంలోకి దిగాలని వారు కోరారు.
వైఎస్ఆర్సీపీలోకి చేరిన లింగాల టీడీపీ నాయకులు..
మండల కేంద్రమైన లింగాలకు చెందిన టీడీపీ అభ్యర్థులు, నాయకులు అలవలపాటి కృష్ణారెడ్డి, అలవలపాటి దివాకర్రెడ్డి ఆదివారం సాయంత్రం వైఎస్ఆర్ సీపీ నాయకులు వైఎస్ భాస్కర్రెడ్డి సమక్షంలో రాజుల భాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీలోకి చేరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు రాజుల పురుషోత్తమరెడ్డి, లింగాల మండల నాయకులు సారెడ్డి చంద్రశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
0 comments:
Post a Comment