వైఎస్సార్ అన్ని ప్రాంతాలను సమానంగా ప్రేమించారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ అన్ని ప్రాంతాలను సమానంగా ప్రేమించారు

వైఎస్సార్ అన్ని ప్రాంతాలను సమానంగా ప్రేమించారు

Written By news on Monday, March 24, 2014 | 3/24/2014

'వైఎస్సార్ అన్ని ప్రాంతాలను సమానంగా ప్రేమించారు'
మడిపల్లి(ఖమ్మం): ఆ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ అన్ని ప్రాంతాలను సమానంగా ప్రేమించేవారని వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మగుర్తు చేశారు.  వైఎస్సార్ తన పాలనలో సువర్ణయుగాన్ని తీసుకువస్తే...ఆయన తర్వాత కాంగ్రెస్ పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారన్నారు. ఎన్నికల రోడ్ షోలో భాగంగా మడిపల్లిలో ప్రసంగించిన విజయమ్మ..  వైఎస్సార్ పాలన అనంతరం రాష్ట్రం గందరగోళ పరిస్థితులు చోటుచేసుకున్నాయన్నారు.  ప్రజలందరినీ తనవారిగానే భావించిన నేత వైఎస్సార్ అని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత ఏదైనా ఉందంటే అది వైఎస్సార్ కే దక్కుతుందన్నారు.  ఆయన హయాంలో ఏ ఒక్క ఛార్జీ పెరగలేదని విజయమ్మ తెలిపారు. రైతులకు భరోసా కల్పించేందుకు వైఎస్సార్ అహర్నిశలు శ్రమించేవారన్నారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో ఏ రోజైనా చేసిన వాగ్దాన్నానైనా నిలబెట్టుకున్నారని విజయమ్మ ప్రశ్నించారు. ఆనాటి బాబు పాలనలో తిరిగి తీసుకువస్తానని చెప్పే ధైర్యం ఉందా?అని నిలదీశారు. ఆయన తొమ్మిదేళ్ల పాలన ఒక చీకటిగా యుగంగానే విజయమ్మ అభివర్ణించారు.  రైతులకు కాంగ్రెస్ భరోసా ఇవ్వలేకపోయిందన్నారు. ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య ఖమ్మం వారధిగా నిలువనుందని ఆమె స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి ప్రజల ఆశీస్సులు అందించాలన్నారు.
 
Share this article :

0 comments: