4 రోజుల్లో స్పందించకుంటే రాష్ట్రబంద్: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 4 రోజుల్లో స్పందించకుంటే రాష్ట్రబంద్: వైఎస్ జగన్

4 రోజుల్లో స్పందించకుంటే రాష్ట్రబంద్: వైఎస్ జగన్

Written By news on Tuesday, May 12, 2015 | 5/12/2015


4 రోజుల్లో స్పందించకుంటే రాష్ట్రబంద్: వైఎస్ జగన్
అనంతపురం:  ఆర్టీసీ కార్మికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రైతు భరోసా యాత్రలో ఉన్న ఆయన మంగళవారం అనంతపురం బస్టాండ్ వద్ద సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులను కలిశారు. ఆర్టీసీ కార్మికులకు తమ పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరవకముందు జిల్లాలోని ఉపాధి హామీ కూలీలను ఆయన పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న చంద్రబాబు నాయుడు తన మాట నిలుపుకోలేదని వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని ఎన్నికలకు ముందు బాబు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇందులో ఏ ఒక్కటీ చంద్రబాబు నెరవేర్చలేదని వైఎస్ జగన్ విమర్శించారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, కార్మికులు కోరుతున్న 43శాతం ఫిట్ మెంట్ న్యాయబద్ధమేనని వైఎస్ జగన్ అన్నారు. ఏడు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మరో నాలుగు రోజులు వేచి చూస్తామని, అప్పటికీ సర్కార్ దిగి రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా బంద్ చేపడతామని వైఎస్ జగన్ హెచ్చరించారు.
Share this article :

0 comments: