గుమ్మిడిపూండి : నీతి, నిజాయితీకి ఆలస్యంగానైనా విజయం లభిస్తుందని నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా అన్నారు. సోమవారం చెన్నై శివారులోని పొన్నేరిలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన ఆమె వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కోర్టు నిర్దోషిగా విడుదల చేయడంపై ఆమె స్పందిస్తూ ప్రజల మనస్సులను చూరగొన్న సీఎంగా అమెకు గొప్ప పేరు ఉందన్నారు.
కొంతమంది అన్యాయంగా కేసు పెట్టారని, నీతి, నిజాయితీకి ముందుగా కొన్ని ఇబ్బం దులు ఎదురైనా అంతిమంగా విజయం దక్కుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టినా నిర్దోషిగా బయటకు వస్తారని, దీనికి ఉదాహరణగా జయలలిత కేసు తీర్పును పేర్కొనవచ్చని తెలిపారు. ప్రజాసేవకే అంకితమైన జయలలిత మీద కేసులు పెట్టడం అవివేకంగా పేర్కొన్నారు. రోజా వెంట ఆమె భర్త ఆర్.కే.సెల్వమణి, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.
కొంతమంది అన్యాయంగా కేసు పెట్టారని, నీతి, నిజాయితీకి ముందుగా కొన్ని ఇబ్బం దులు ఎదురైనా అంతిమంగా విజయం దక్కుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్రెడ్డిపై ఎన్ని కేసులు పెట్టినా నిర్దోషిగా బయటకు వస్తారని, దీనికి ఉదాహరణగా జయలలిత కేసు తీర్పును పేర్కొనవచ్చని తెలిపారు. ప్రజాసేవకే అంకితమైన జయలలిత మీద కేసులు పెట్టడం అవివేకంగా పేర్కొన్నారు. రోజా వెంట ఆమె భర్త ఆర్.కే.సెల్వమణి, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు.
0 comments:
Post a Comment