సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీకి 140-145 అసెంబ్లీ స్థానాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీకి 140-145 అసెంబ్లీ స్థానాలు

సీమాంధ్రలో వైఎస్సార్‌సీపీకి 140-145 అసెంబ్లీ స్థానాలు

Written By news on Sunday, September 1, 2013 | 9/01/2013

రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగనుందని ఓ జాతీయ సంస్థ నిర్వహించిన  సర్వేలో వెల్లడైంది. గతవారం సీమాంధ్రలో నిర్వహించిన సర్వేలో వైఎస్సార్‌సీపీ అగ్రస్థానంలో నిలిచింది. కాగా ప్రస్తుత అధికార కాంగ్రెస్ పార్టీ స్వల్ప స్థానాలతో సరిపెట్టుకోనుందని సర్వే అభిప్రాయపడింది. సీమాంధ్ర ప్రజలు వైఎస్సార్‌సీపీకే పట్టంకట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.కాగా, టీడీపీ మాత్రం ఓట్ల శాతంలో కాంగ్రెస్ కంటే ముందంజంలో కొనసాగింది.  కేవలం 10 శాతం ఓట్లను మాత్రమే కాంగ్రెస్ సాధించే అవకాశం ఉంది.

60 శాతం ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గుచూపుగా, 30 శాతం ప్రజలు మాత్రం తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. దీంతో వైఎస్సార్‌సీపీకి 140-145 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే పేర్కొంది.  వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్మోహనరెడ్డి సీమాంధ్రలో తన బలాన్ని గణనీయంగా పెంచుకున్నారని గత కొన్ని రోజుల క్రితం ఓ ప్రముఖ వార్తా పత్రికలో ప్రచురితమైన సంగతి తెలిసిందే.
Share this article :

0 comments: