సొంతమామకే వెన్నుపోటు పొడిచిన వ్యక్తికి ప్రజలో లెక్కా అని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్ష నేత అయ్యుండి రాష్ట్ర విభజనకు బ్లాంక్ చెక్లాంటి లేఖ ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకోండని చంద్రబాబును కోరారు. 9 ఏళ్ల పాలనలో వ్యవసాయాన్ని దండగ చేసిన వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ మరోమారు అధికారం ఇమ్మంటున్నారని ఎద్దేవా చేశారు. ఓ వైపు రాష్ట్రాన్ని చీల్చాలంటూ, మరోవైపు బస్సుయాత్ర చేస్తున్నారని బాబుపై మండిపడ్డారు.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో సువర్ణయుగం నడిచిందని గుర్తు చేశారు. ఏ ఛార్జీలు పెంచకుండా ఆయన పాలన చేశారన్నారు. అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వైఎస్ అద్భుతంగా అమలు చేశారని తెలిపారు. ఇప్పుడున్న కిరణ్ సర్కార్ అన్ని ఛార్జీలు పెంచిందన్నారు. పేదవాడు ఛార్జీలు కట్టలేక చతికిలపడుతుంటే కాంగ్రెస్ నవ్వుతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్కు నిప్పుపెట్టి కాంగ్రెస్ చలి కాచుకుంటోందని షర్మిల మండిపడ్డారు.
0 comments:
Post a Comment