చంద్రబాబు వేర్పాటువాది: జోగి రమేష్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు వేర్పాటువాది: జోగి రమేష్

చంద్రబాబు వేర్పాటువాది: జోగి రమేష్

Written By news on Friday, September 6, 2013 | 9/06/2013

చంద్రబాబు వేర్పాటువాది: జోగి రమేష్
కృష్ణా: తెలంగాణ లేఖ ఇచ్చిన రోజే తెలుగుజాతి మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు
జోగి రమేష్ విమర్శించారు. లక్షల కోట్ల ప్యాకేజీ కావాలంటూ చంద్రబాబే స్వయంగా తన బండారంను బయటపెట్టుకున్నారని అన్నారు. సీమాంధ్ర ప్రజలను మభ్యపెడుతూ, ఆత్మగౌరవమంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ ముమ్మాటికి సమైక్యవాదే, చంద్రబాబే వేర్పాటువాది అని జోగి రమేష్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడానికి టీడీపీనే కారణమని జోగి రమేష్ అంతకుముందు విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి  నేతలు చీడపురుగులని ఆయన మండిపడ్డారు. రాజీనామాలు చేశామంటున్న కాంగ్రెస్ నేతలు అధికారాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. రాజీనామాలు ఆమోదించుకుని ఉద్యమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొనాలని డిమాండ్ చేశారు.
Share this article :

0 comments: