https://www.facebook.com/ysrcpofficial
రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రిమండలి తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా 72 గంటల బంద్కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
బీహార్ నుంచి జార్ఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రాలను విభజించినపుడు కూడా మూడు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీలో తీర్మానాలు చేసిన తర్వాతే విభజనకు శ్రీకారం చుట్టారు. కానీ ఇవాళ అసెంబ్లీ తీర్మానం చేయకుండా పక్కన పెట్టడానికి ముఖ్య కారణం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ...ఈ రెండూ కూడా కలిసిపోయాయి కాబట్టే, కుట్ర చే సి ఏకంగా రాష్ట్రాన్నే అమ్మేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు మేం శత విధాల ప్రయత్నించాం. అసెంబ్లీని సమావేశపర్చండి అన్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తీర్మానం చేసి పంపించాలన్నాం. అందులో భాగంగానే రాష్ట్ర గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇచ్చాం. సీఎం కిరణ్కుమార్రెడ్డికి లేఖ రాశాం.. అని జగన్ పేర్కొన్నారు.
ఎంపీలందరూ రాజీనామా చేస్తే, ఇప్పటికే మైనార్టీలో ఉన్న యూపీఏ ప్రభుత్వం పడిపోతుందని అప్పుడు విభజన ప్రక్రియ ఆగిపోతుందని జగన్ అభిప్రాయపడ్డారు. .
0 comments:
Post a Comment