రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి, స్పీకర్, సుప్రీంకోర్టుకు 'సమైక్య' అఫిడవిట్లు సమర్పించనున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నాయకత్వంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి అఫిడవిట్లు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అఫిడవిట్లు సమర్పించేందుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు. ఈ నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమైక్య అఫిడవిట్లపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అఫిడవిట్లు ఇవ్వడానికి ఎమ్మెల్యేలందరూ ముందుకు రావాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిన్ని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ఇందుకు ముందుకు రావాలని వారిని కోరారు. శీతకాల విడిది కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 31 వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అఫిడవిట్లు ఇవ్వడానికి ఎమ్మెల్యేలందరూ ముందుకు రావాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి నిన్ని పిలుపునిచ్చారు. పార్టీలకు అతీతంగా ఇందుకు ముందుకు రావాలని వారిని కోరారు. శీతకాల విడిది కోసం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిన్న హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 31 వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు.
0 comments:
Post a Comment