సమైక్యాంధ్ర పోరాటమే జగన్ కు ఇచ్చే కానుక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సమైక్యాంధ్ర పోరాటమే జగన్ కు ఇచ్చే కానుక

సమైక్యాంధ్ర పోరాటమే జగన్ కు ఇచ్చే కానుక

Written By news on Saturday, December 21, 2013 | 12/21/2013

'సమైక్యాంధ్ర పోరాటమే జగన్ కు ఇచ్చే కానుక'
హైదరాబాద్ : సమైక్యాంధ్ర కోసం పోరాడటమే వైఎస్‌  జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టిన రోజుకు ఇచ్చే కానుక అని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు చెప్పారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీస్తే  తెలుగుజాతి బలహీనపడిపోతుందని తెలిపారు. తెలుగుజాతి బలహీనపడకూడదని పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు వైఎస్‌  జగన్‌ అని చెప్పారు.

వైఎస్  జగన్‌మోహన్ రెడ్డి లేవనెత్తిన ప్రతిమాట కూడా భారత దేశంలో చర్చనీయాంశం అవుతోందన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే  ఊరుకోబోమని గట్టు అన్నారు. జగన్ జన్మదినం సందర్భంగా   వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు మాట్లాడారు. రాష్ట్రం నుంచి నీచ రాజకీయాలను పారద్రోలడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతపురంజిల్లా కదిరిలో జగన్ జన్మదిన వేడుకలు పూలవ్యాపారస్తులు ఘనంగా నిర్వహించారు. వేమారెడ్డి సర్కిల్‌లో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత జక్కల ఆదిశేషు పాల్గొని కేక్‌ కట్ చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. పేదలకు, వృద్దులకు బట్టలు పంపిణీ చేశారు. వైఎస్ఆర్‌ సీపీ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి జీవితం  యువతకు ఆదర్శమని చెప్పారు
Share this article :

0 comments: