నేడు రాష్ర్టపతిని కలవనున్న జగన్ బృందం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నేడు రాష్ర్టపతిని కలవనున్న జగన్ బృందం

నేడు రాష్ర్టపతిని కలవనున్న జగన్ బృందం

Written By news on Thursday, December 26, 2013 | 12/26/2013


నేడు రాష్ర్టపతిని కలవనున్న జగన్ బృందం
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఆ పార్టీ ప్రతినిధి బృందం గురువారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచాలని విజ్ఞప్తి చేయనున్నారు. శీతాకాల విడిది కోసం నగరంలో ఉన్న రాష్ట్రపతిని కలుసుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే అపాయింట్‌మెంట్ కోరారు.

జగన్‌తో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని ఉదయం 11.30కు కలవనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. రాష్ట్రపతిని కలుసుకోవడానికి ముందు ఆ నేతలు జగన్ క్యాంపు కార్యాలయంలో సమావేశమవుతారు.
Share this article :

0 comments: