ఓదార్పు యాత్రకు అనుమతివ్వండి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఓదార్పు యాత్రకు అనుమతివ్వండి

ఓదార్పు యాత్రకు అనుమతివ్వండి

Written By news on Tuesday, December 24, 2013 | 12/24/2013

ఓదార్పు యాత్రకు అనుమతివ్వండివీడియోకి క్లిక్ చేయండి
బెంగళూరు మీదుగా పలమనేరు వెళ్లేందుకు..
కోర్టును అనుమతి కోరిన వైఎస్ జగన్


సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించేందుకుగాను బెంగళూరు మీదుగా చిత్తూరు జిల్లా పలమనేరు వెళ్లేందుకు అనుమతించాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగన్ తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 26న బెంగళూరులో బస చేసి 27న పలమనేరు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు. ఆయన జనవరి 2 వరకు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారని, గతంలో మధ్యలో ఆపిన ఓదార్పు యాత్రతోపాటు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్‌తో సమైక్య శంఖారావం కార్యక్రమాన్ని చేపట్టనున్నారని చెప్పారు. ఈ పిటిషన్‌ను విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టుల ఇన్‌చార్జ్ న్యాయమూర్తి.. సీబీఐ అభిప్రాయాన్ని కోరుతూ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.
Share this article :

0 comments: