ఈనెల 9న వైఎస్సార్ సీపీ లో చేరనున్నధర్మాన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈనెల 9న వైఎస్సార్ సీపీ లో చేరనున్నధర్మాన

ఈనెల 9న వైఎస్సార్ సీపీ లో చేరనున్నధర్మాన

Written By news on Thursday, February 6, 2014 | 2/06/2014

శ్రీకాకుళం:ఈ నెల 9వ తేదీన పట్టణంలో జరిగే సమైక్యశంఖారావం సభలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. త్వరలో విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం చేపట్టనున్నారు. ఫిబ్రవరి 8వ తేదీన విశాఖ జిల్లాలోని చోడవరం, గాజువాకల్లో జగన్ సమైక్యశంఖారావం కార్యక్రమం ఉంటుంది. అనంతరం మరుసటి రోజు బోగాపురం, శ్రీకాకుళంలలో బహిరంగ సభలు ఉంటాయి. శ్రీకాకుళంలో జరిగే బహిరంగ సభలో ధర్మాన వైఎస్సార్ సీపీ లో చేరనున్నారు.
 
జగన్ సమక్షంలోనే సుమారు లక్షమందితో  వైఎస్సార్ సీపీలో చేరుతానని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఇచ్ఛాపురంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీని వైఎస్సార్‌సీపీలో కలిపేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైన కాంగ్రెస్‌ను, దానికి సహకరిస్తున్న టీడీపీని వచ్చే ఎన్నికల్లో మట్టి కరిపించాలంటే ప్రతి ఒక్కరూ వైఎస్సార్‌సీపీలో చేరాలన్నారు.
Share this article :

0 comments: