నేడు ఢిల్లీకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బుధవారం ఢిల్లీకి బయలుదేరి వెళుతున్నారు. నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ్యులందరూ మంగళవారం రాత్రికి హైదరాబాద్కు చేరుకున్నారు. మధ్యాహ్న సమయంలో ఢిల్లీ చేరుకునే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్కడ రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీతో సహా, పలు జాతీయ నేతలను కలుసుకోనున్నారు. రాష్ట్ర విభ జనను అడ్డుకోవాలని వారికి విజ్ఞప్తి చేయనున్నారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. శాసనసభ్యులు జాతీయ నాయకులను కలిసేటపుడు ఆయన కూడా వారితో వెళతారు.
0 comments:
Post a Comment