కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు రాజకీయాలు చేసే మీరా మమ్మల్ని విమర్శించేది అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... వైఎస్ఆర్ సీపీని ఉద్దేశించి సిగ్గు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు అని అన్నారు.
నైతికత గురించి మాట్లాడే హక్కులేదని చంద్రబాబును శ్రీకాంత్రెడ్డి నిలదీశారు. రాజ్యసభకు ఇద్దరు అభ్యర్థులను నిలబెట్టడానికి కాంగ్రెస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నది వాస్తవం కాదా? అని శ్రీకాంత్రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో ఉండి కూడా బీఏసీకి రాని మీరా మమ్మల్ని విమర్శించేది అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి హోల్సేల్గా అమ్మితే, నువ్వు రిటైల్గా అమ్ముతున్నావు అని చంద్రబాబుపై శ్రీకాంత్రెడ్డి ఫైర్ అయ్యారు.
0 comments:
Post a Comment