ఇడుపులపాయ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా వైఎస్ జగన్మోహన రెడ్డి రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయలో ప్రజా ప్రస్థానం పేరుతో జరుగుతున్న పార్టీ 2వ ప్లీనరీలో పార్టీ ఎన్నికల కన్వీనర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఈ విషయం ప్రకటించారు. నిన్న సాయంత్రం జరిగిన సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు.
నామినేషన్ల పర్వం ప్రారంభమైన తరువాత 16 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు చెప్పారు. వాటిలో మొదటి సెట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా వైఎస్ జగన్మోహన రెడ్డిని షర్మిల ప్రతిపాదించగా, వైవి సుబ్బారెడ్డి బలపరిచినట్లు తెలిపారు. మొత్తం 16 నామినేషన్లలోనూ జగన్మోహన రెడ్డి పేరునే ప్రతిపాదించినట్లు వివరించారు. మరొకరిపేరుతో నామినేషన్ దాఖలు కానందున జగన్మోహన రెడ్డి పార్టీ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
జగన్మోహన రెడ్డిని పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల, పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందించారు. జగన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పార్టీ కార్యకర్తలలో ఆనందం వెల్లివిరిసింది.
నామినేషన్ల పర్వం ప్రారంభమైన తరువాత 16 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు చెప్పారు. వాటిలో మొదటి సెట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా వైఎస్ జగన్మోహన రెడ్డిని షర్మిల ప్రతిపాదించగా, వైవి సుబ్బారెడ్డి బలపరిచినట్లు తెలిపారు. మొత్తం 16 నామినేషన్లలోనూ జగన్మోహన రెడ్డి పేరునే ప్రతిపాదించినట్లు వివరించారు. మరొకరిపేరుతో నామినేషన్ దాఖలు కానందున జగన్మోహన రెడ్డి పార్టీ అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
జగన్మోహన రెడ్డిని పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, షర్మిల, పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందించారు. జగన్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పార్టీ కార్యకర్తలలో ఆనందం వెల్లివిరిసింది.
0 comments:
Post a Comment