Home »
» నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్
నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్
పులివెందుల, న్యూస్లైన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఇడుపులపాయకు రానున్నట్లు వైఎస్ఆర్ సీపీ పులివెందుల నియోజకవర్గ నాయకులు వైఎస్ భాస్కర్రెడ్డి తెలియజేశారు. అనంతపురం జిల్లాలో జన భేరీ కార్యక్రమంలో భాగంగా పలుచోట్ల బహిరంగ సభలలో పాల్గొన్న అనంతరం బుధవారం రాత్రికి వైఎస్ జగన్ ఇడుపులపాయ చేరుకుంటార న్నారు. గురువారం ఉదయం తండ్రి, మహానేత వైఎస్కు నివాళి అర్పిస్తారన్నారు. అనంతరం ఇడుపులపాయ నుంచి నేరుగా స్వగృహానికి చేరుకుంటారన్నారు. ఉదయం 8-30 గంటలకు నామినేషన్ వేయడానికి ఇంటి నుంచి బయలుదేరుతారన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బస్టాండు నుంచి భారీ ర్యాలీ ఉంటుందన్నారు. ఈ ర్యాలీ మెయిన్ బజార్, పాత బస్టాండు, పూలంగళ్ల వరకు సాగుతుందన్నారు. అక్కడ ప్రజలనుద్ధేశించి వైఎస్ జగన్ ప్రసంగిస్తారన్నారు. అనంతరం ముద్దనూరు రోడ్డుమీదుగా తహశీల్దార్ కార్యాలయానికి చేరుకుంటారన్నారు. 11గంటలనుంచి 12గంటల మధ్య నామినేషన్ వేస్తారన్నారు. నామినేషన్ కార్యక్రమానికి పులివెందుల నియోజకవర్గం నుంచి కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని భాస్కరరెడ్డి కోరారు.
0 comments:
Post a Comment