రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల పర్వం బుధవారం ఊపందుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు తమ తమ నామినేషన్లు దాఖలు చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ లోక్సభ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చెలమశెట్టి సునీల్ నామినేషన్ దాఖలు చేశారు. అదే జిల్లాకు చెందిన రాజమండ్రి లోక్సభ స్థానానికి బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి నామినేషన్ వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం లోక్ సభ స్థానానికి వంకా రవీందర్ నామినేషన్ దాఖలు చేశారు.
అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట అసెంబ్లీ స్థానానికి సామినేని ఉదయభాను, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగర అసెంబ్లీ స్థానానికి బొమ్మన రాజకుమార్, కాకినాడ నగర అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్, కాకినాడ గ్రామీణ అసెంబ్లీ స్థానానికి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, జగ్గంపేట అసెంబ్లీ స్థానానికి జ్యోతుల నెహ్రూ, రాజోలు అసెంబ్లీ స్థానానికి బొంతు రాజేశ్వరరావు, ముమ్మిడివరం అసెంబ్లీ స్థానానికి గుత్తుల సాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.
అలాగే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట అసెంబ్లీ స్థానానికి సామినేని ఉదయభాను, తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగర అసెంబ్లీ స్థానానికి బొమ్మన రాజకుమార్, కాకినాడ నగర అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన ద్వారంపూడి చంద్రశేఖర్, కాకినాడ గ్రామీణ అసెంబ్లీ స్థానానికి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, జగ్గంపేట అసెంబ్లీ స్థానానికి జ్యోతుల నెహ్రూ, రాజోలు అసెంబ్లీ స్థానానికి బొంతు రాజేశ్వరరావు, ముమ్మిడివరం అసెంబ్లీ స్థానానికి గుత్తుల సాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు.
0 comments:
Post a Comment