ఎల్లో కూటమికి జగన్ ఫోబియా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎల్లో కూటమికి జగన్ ఫోబియా

ఎల్లో కూటమికి జగన్ ఫోబియా

Written By news on Tuesday, August 20, 2013 | 8/20/2013

విజయమ్మ ప్రసంగాన్ని వక్రీకరిస్తూ ఓ టీవీ చానల్ ప్రసారాలు
 జైలులో జగన్ ఫోన్‌లో మాట్లాడుతున్నారంటూ దుష్ర్పచారం
 ఆ దుష్ర్పచారం ఆధారంగా టీడీపీ తప్పుడు ఆరోపణలు
ఏడాదికి పైగా జగన్ జైలు సౌకర్యాలపై విమర్శలు

 
 సాక్షి, హైదరాబాద్: ‘‘మరి ఈ రోజు మీ అందరి పక్షంగా నేను ఇక్కడ... ఇక్కడికి పొమ్మని చెప్పాడు. ఆయనకు కూడా నేను చెప్పి పంపిస్తాను.. మీ అందరి ప్రేమ (కార్యకర్తల నుంచి పెద్దపెట్టున ఈలలు, కేకలు).. మీ అందరి ప్రేమ, అభిమానం.. ఆయనకు అన్నీ కూడా చెప్పమని చెప్పి నేను ఫోను చేసి చెప్తాను... జగన్‌బాబుకు. మనందరం కలిసి న్యాయం జరిపించుకుందాం. రెండు ప్రాంతాలకు సమ న్యాయం జరగాలనేదే వైఎస్సార్‌సీపీ కోరుకునేది...’’
 
 రాష్ట్ర విభజన ప్రక్రియపై అధికార కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఆదివారం గుంటూరులో ఆమరణ దీక్షను ప్రారంభిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేసిన ప్రసంగంలో కొన్ని మాటలివి. పార్టీ నాయకులకో లేదంటే కుటుంబ సభ్యులకో ఫోను చేసి, వారు ములాఖత్‌కు వెళ్లినప్పుడు గుంటూరు ప్రజల అభిమానం గురించి జగన్‌బాబుకు ‘‘చెప్పమని చెబుతానన్న’’ విజయమ్మ మాటలను.. జగన్ ఫోబియాతో సతమతమవుతున్న ఎల్లో మీడియా, పచ్చ పార్టీ నేతలు వక్రీకరిస్తూ దుష్ర్పచారం చేయటానికి రంగంలోకి దిగారు. జైలులో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో మాట్లాడుతున్నారంటూ టీడీపీ అనుకూల ప్రైవేటు చానల్ ఒకటి విషప్రచారం మొదలుపెట్టింది.
 
  ‘జైలులో ఉన్న జగన్‌కు ఫోను చేస్తానన్నారు విజయలక్ష్మి’ అంటూ ఆ ప్రైవేట్ చానల్ తన పైత్యాన్ని ప్రదర్శిస్తే.. టీడీపీ నేతలు ఆ టీవీ చానల్ ప్రసారాల ఆధారంగా జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలు లంకించుకున్నారు. ‘ఆయనను ప్రభుత్వం ఫైవ్‌స్టార్ హోటల్‌లో పెట్టినట్టు చూస్తోంది. జైలులో ఉండే వ్యక్తితో ఆమె ఫోన్‌లో ఎలా మాట్లాడుతుంది?’ అంటూ టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, గాలి ముద్దుకృష్ణమనాయుడు విమర్శలు మొదలుపెట్టారు.
 
 ఏడాది పైగా దుష్ర్పచారమే...
 వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సంబంధించిన ఏ విషయమైనా వెర్రిగా ప్రవర్తించే ఎల్లోమీడియా, టీడీపీ నేతలు గత ఏడాది కాలంగా జైలులో ఉన్న వ్యక్తికి కల్పించే సౌకర్యాలపై తప్పుడు ప్రచారమే చేస్తున్నారు. అత్యంత బాధ్యతాయుతమైన రాష్ట్ర శాసనసభ స్పీకర్ పదవితో పాటు రాష్ట్ర మంత్రిగా పనిచేసి, ప్రస్తుతం రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న యనమల రామకృష్ణుడు గడిచిన ఏడాదిన్నర కాలంలో కనీసం ఒక్క రోజైనా ప్రజాసమస్యలపై గళం విప్పారో లేదో గానీ.. జైలులో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి విపరీతమైన సౌకర్యాలు కల్పిస్తున్నారని, ఆయన ములాఖత్‌లను తప్పుపడుతూ తరచూ తప్పుడు ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.
 
 జగన్‌మోహన్‌రెడ్డికి ములాఖత్‌లు ఎందుకు అనుమతి ఇస్తున్నారు? ఆయన సెల్‌ఫోను ఎలా ఉపయోగిస్తారు? అంటూ తమకు తోచిన ఆరోపణలను కలగలపి జైలు నిబంధనలకు నీళ్లొదులుతున్నారంటూ ఆయన పదేపదే అధికారులకు లేఖలు రాశారు. జైలులో అన్నీ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని.. జగన్‌మోహన్‌రెడ్డి ములాఖత్‌లలో ఎలాంటి అక్రమాలు జరగటం లేదని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేసినా, టీడీపీ నేతలు జగన్ విషయంలో తమ ఫోబియాను ఎప్పటికప్పుడు ప్రదర్శించుకుంటూనే ఉన్నారు
Share this article :

0 comments: