చంద్రబాబుది 'ఆత్మవంచన' యాత్ర: భూమన - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబుది 'ఆత్మవంచన' యాత్ర: భూమన

చంద్రబాబుది 'ఆత్మవంచన' యాత్ర: భూమన

Written By news on Wednesday, August 21, 2013 | 8/21/2013

చంద్రబాబుది 'ఆత్మవంచన' యాత్ర: భూమన
తిరుపతి: : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం తిరుపతిలో మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరిట చంద్రబాబు మరోసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను వంచించేందుకు సిద్ధమవుతున్నారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు చేపట్టేది ఆత్మగౌరవ యాత్రకాదు.. ఆత్మవంచన యాత్ర అని భూమన ఈ సందర్భంగా అభివర్ణించారు. సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవానికి చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు.

రాష్ట్ర విభజనకు మూలకారకుడు చంద్రబాబే అని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలో చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేపట్టనున్నారు. అయితే ఆ యాత్ర తిరుపతి నుంచి లేదా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా నుంచా అనేది ఇంకా తెలుగుదేశంపార్టీ  వర్గాలు నిర్ణయించాల్సి ఉందన్న విషయం తెలిసిందే.

అయితే చిత్తూరు జిల్లాలో సమైక్య ఉద్యమం నిరసనలు సెగలు కక్కుతుంది. జిల్లాలోని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తిరుపతి నగరంలో దుకాణాలు, సంస్థలు మూసివేశారు. అలాగే రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తు వైఎస్ ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం గుంటూరులో సమరభేరీ దీక్ష చేపట్టారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా తిరుపతిలోని తుడా సర్కిల్ లో ఆ పార్టీ ఎస్పీ విభాగానికి చెందిన మద్దుతుదారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.  
Share this article :

0 comments: