రాష్ట్ర విభజనకు మూలకారకుడు చంద్రబాబే అని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నేపథ్యంలో చంద్రబాబు ఆత్మగౌరవ యాత్ర చేపట్టనున్నారు. అయితే ఆ యాత్ర తిరుపతి నుంచి లేదా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లా నుంచా అనేది ఇంకా తెలుగుదేశంపార్టీ వర్గాలు నిర్ణయించాల్సి ఉందన్న విషయం తెలిసిందే.
అయితే చిత్తూరు జిల్లాలో సమైక్య ఉద్యమం నిరసనలు సెగలు కక్కుతుంది. జిల్లాలోని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తిరుపతి నగరంలో దుకాణాలు, సంస్థలు మూసివేశారు. అలాగే రెండు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని డిమాండ్ చేస్తు వైఎస్ ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సోమవారం గుంటూరులో సమరభేరీ దీక్ష చేపట్టారు. విజయమ్మ దీక్షకు మద్దతుగా తిరుపతిలోని తుడా సర్కిల్ లో ఆ పార్టీ ఎస్పీ విభాగానికి చెందిన మద్దుతుదారులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
0 comments:
Post a Comment