గుంటూరు: : కాంగ్రెస్ పార్టీ విషపు కౌగిలిలో కొండాసురేఖ చిక్కుకోవడం బాధగా ఉందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబటి రాంబాబు, శ్రీధర్ రెడ్డిలు అభిప్రాయపడ్డారు. బుధవారం గుంటూరులో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు ప్రసంగించారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన స్ర్కిప్ట్ ను కొండా సురేఖ చదివారని వారు పేర్కొన్నారు. ఓ వేళ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలనుకుంటే వెళ్లోచ్చని వారు కొండాసురేఖకు ఈ సందర్భంగా హితవు పలికారు.
రాఖీ పండగ సందర్భంగా వైఎస్ జగన్ పై సోదరి కొండా సురేఖ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు. వైఎస్ జగన్ పై నిందలు వేయడం మంచిదికాదని తెలిపారు. ఇప్పటివరకు తమ పార్టీ నాయకులపై కొండ సురేఖ ఆరోపణలు చేసిన సంయమనంతో వ్యవహరించామని అంబటి రాంబాబు, శ్రీధర్ రెడ్డిలు గుర్తు చేశారు. వైఎస్ జగన్ పై కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.
రాఖీ పండగ సందర్భంగా వైఎస్ జగన్ పై సోదరి కొండా సురేఖ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వారు ఆరోపించారు. వైఎస్ జగన్ పై నిందలు వేయడం మంచిదికాదని తెలిపారు. ఇప్పటివరకు తమ పార్టీ నాయకులపై కొండ సురేఖ ఆరోపణలు చేసిన సంయమనంతో వ్యవహరించామని అంబటి రాంబాబు, శ్రీధర్ రెడ్డిలు గుర్తు చేశారు. వైఎస్ జగన్ పై కొండాసురేఖ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.
0 comments:
Post a Comment