హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే వైఎస్ఆర్ సీపీ ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. దాంతో డ్వాక్రా రుణాల మాఫీపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు పట్టుబట్టారు.
మహిళాద్రోహి చంద్రబాబు అంటూ సభ్యులు పెద్ద ఎత్తున సభలో నినాదాలు చేశారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తమ పట్టు వీడలేదు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సమావేశాలను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.
మహిళాద్రోహి చంద్రబాబు అంటూ సభ్యులు పెద్ద ఎత్తున సభలో నినాదాలు చేశారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు తమ పట్టు వీడలేదు. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడటంతో స్పీకర్ సమావేశాలను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.
0 comments:
Post a Comment