వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ వివక్ష: వైఎస్ జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ వివక్ష: వైఎస్ జగన్

వైఎస్ ఆర్ సీపీ ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ వివక్ష: వైఎస్ జగన్

Written By news on Monday, March 9, 2015 | 3/09/2015

విపక్ష సభ్యులపై స్పీకర్‌ వివక్ష చూపుతున్నారని ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా  అధికార పార్టీ సభ్యుడు  శ్రావణ్‌ కుమార్‌ చేసిన ఆరోపణలపై వైఎస్‌ జగన్‌ స్పందించారు.  శ్రావణ్‌ కుమార్‌ తమ ఎమ్మెల్యే పేరు ప్రస్తావించడం సబబు కాదని అన్నారు.
 
దీనిపై మాట్లాడేందుకు విపక్షానికి అవకాశమివ్వాలని డిమాండ్‌ చేశారు. ధూళిపాళ్ల నరేంద్రకు మాట్లాడేందుకు మైక్ ఎందుకు ఇచ్చారని, ఆయన ఏమైనా మంత్రా అంటూ వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమకు వివరణ ఇచ్చేందుకు కూడా స్పీకర్ అవకాశం కూడా ఇవ్వటం లేదన్నారు.
Share this article :

0 comments: