నోరు తెరిస్తే అబద్ధాలు అని, చంద్రబాబు నాయుడుతో పాటు పార్టీ నేతలు కూడా అన్ని నేర్చుకున్నారన్నారు. సింగపూర్, జపాన్, అమెరికా మాదిరిగా రాజధాని కట్టండని తమకు ఎలాంటి అభ్యంతరం లేదని...అయితే బలవంతంగా రైతుల నుంచి భూములు లాక్కోవటం సరికాదన్నారు. రైతుల భూములతో రియల్ వ్యాపారం చేస్తారా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతుందని అసెంబ్లీలో అధికార పక్షం అంటుందని....విభజన విషయంలో కేంద్రం అన్యాయం చేసినప్పుడు ప్రభుత్వంలో టీడీపీ...ఎందుకు కొనసాగుతుందని వైఎస్ జగన్ ప్రశ్నలు సంధించారు. కేంద్ర వైఖరిని ఎండగడుతూ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి పోరాడవచ్చు కదా అని ఆయన అన్నారు.
0 comments:
Post a Comment